హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, డిసెంబర్ 31, 2012

మారేడుదళాల నోము


          పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువుడు తీరి చనిపోయాడు.  రాజపీనుగు తోడులేకుండా పోరాదుకనుక నా కుమారుని శవానికి తోడుగా పోవుటకు ఎవరైనా తీసుకు రావలసిందని మృతుని తండ్రియైన మహారాజు భటులను పంపాడు.  ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వానికి తోడుగా పోవుటకు గాని తమ వారి నేవరైనా తోడుగా పంపించుటకు గాని ఏ ఒక్కరూ అంగీకరించలేదు.  
           ధనాశ పరులైన ఒక బ్రాహ్మణ వనితా తన సవతి బిడ్డను ఎత్తుకు ఎట్టు ధనం పుచ్చుకుని పంపించుటకు అంగీకరించినది.  ఆమె కోరిన ప్రకారం ధనమిచ్చి రాజు భటులు పిల్లను తీసుకుని వెళ్ళారు.  అలా తీసుకుని వచ్చిన ఆ పిల్లను రాకుమారుని శవంతోపాటు కటి స్మాశానానికి తీసుకుని వెళ్ళుతున్నారు.  ఆకస్మికంగా చీకట్లు కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది.  ఆ వర్షంలో చెకటిలో ముందుకు పోలేక శవాన్ని శివాలంముండు దింపి వారంతా తప్పుకుని వెళ్ళారు.  ఆ బాలిక కట్లు వూడదీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలకు వెళ్లి పార్వతీ పరమేశ్వరులు ముందు కూర్చుని తన దుస్థితికి పరితపిస్తూ భోరుభోరున ఏడ్వసాగింది.  కరునామయులైన ఆ దంపతులు ఆమెను ఆగ్రహించి అక్షతలు జలాన్ని ఇచ్చి రాకుమారుని శవంపై చల్లమన్నారు.  మారేడు దళం నోచుకోవలసినదని చెప్పారు  ఆ ఆది దంపతులు ఆదేశానుసారం ఆ చిన్నది మారేడు దలముల నోమును నోచి శవం పై మంత్ర జలాన్ని సంప్రోక్షించి అక్షింతలు వేసింది.  రాకుమారుడు నిద్రమేల్కొన్న్ట్టు సజీవుడై లేచి కూర్చున్నాడు.  జరిగిన విషయాన్ని యావత్తు ఆమె వల్ల విన్నాడు.  
          ఇంతలో తెల్ల వారుతుండగా రాజు తాలూకు జనులు శవాదాహన సంస్కారం చేయడానికి వచ్చారు బ్రతికి వున్న రాకుమారుడిని చూసి ఆశ్చర్య పడ్డారు.  వారిని అంతఃపురానికి తీసుకువెళ్ళారు.  రాజ దంపతులు ఎంతగానో ఆనందించి ఆ బాలికతో తమ కుమారునికి వివాహం చేసారు.  
ఉద్యాపన:  మారేడు దలములను వెండితోను బంగారముతోను చేయించి మారేడు దలములను మూడింటిని కలిపి మూడు దోసిళ్ళ బియ్యంతో శివునకు పూజచేసి నిరుపేదలకు అన్న దానం చేయ వలెను. 

శనివారం, డిసెంబర్ 29, 2012

బచ్చలిగౌరి నోము


          పూర్వం ఒకానొక ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది.  ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చాడు.  ఆనందంతో ఆ ఇల్లాలు నవగాయ పిండివంటలు చేసింది.  చారుపోపునకు పెరటిలో కరివేపాకు కోసుకురంమని అన్నగారిని పంపింది.  కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని పాము కరిచింది, నురుగులు కక్కుతూ నేలపై పడిపోయాడు.  ఎంతకూ అన్నగారు పెరటిలోనుండి రాకపోవదముతో ఆమె పెరటిలోనికి వచ్చి నురగలు క్రక్కుతూ క్రింద పది వున్న అన్నగారిని చూసింది.  భోరుభోరున ఏడుస్తున్న ఆమెకు పార్వతీ దేవి వృద్ద స్త్రీ రూపంలో వచ్చి ఊరడించి లోనికి వెళ్లి బచ్చల గౌరీ నోమును నోచుకోమ్మంది,   నీ అన్న బ్రతుకుతాడని చెప్పి వెళ్లి పోయింది.  అది జగన్మాత వాక్కుగా గుర్తించి ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోమును నోచింది.  ఆమె అన్న బ్రతికాడు ఆనాటినుండి ఈ నోమును నోచుకుని స్త్రీలు, అన్నా చెల్లెళ్ళు సుఖముగా వున్నారు.   ఉద్యాపన:  శక్తి మేరకు బంగారంతోగాని, వెండితో గాని, బచ్చాలికాయను చేయించి ఆ బచ్చలి కాయను గౌరీదేవికి నివేదించి, బచ్చలి చెట్టును, బచ్చలి కాయను దక్షిణ తామ్బూలములను ఒక ముత్తైదువుకు వాయన మివ్వాలి. 

శుక్రవారం, డిసెంబర్ 28, 2012

చిత్రగుప్తుని నోము


           పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి  భార్య ఎంతో అన్యోన్యంగా వుండేవారు.  ఇరువురూ కలిసి నోములు నోచుకుంటూ వుండేవారు.  రాజు భార్య మాత్రం చిత్ర గుప్తుని నోము మరచి పోయింది.  మంత్రి భార్య మాత్రం మరువక నోము నోచుకున్నది.  కాల క్రమంలో వారిద్దరూ చనిపోయారు.  చిత్ర గుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలుగాచేసాడు.  రాజు భార్య చిత్ర గుప్తుడిని తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది.  నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను.  ఎండువాళ్ళ ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది.  అందుకు చిత్ర గుప్తుడు సమాధాన మిస్తూ ఓ తరునీమనీ! నువ్వు మంత్రి భార్య తోపాటు అన్ని నోములను నోచినాను ఒక్క చిత్ర గుప్తుని నోమును మరచిటివి ఆ నోమును మరచిన ఫలితమే నీకీ నరకము ప్రాప్తించినది అని చెప్పాడు. అప్పుడామే చిత్ర గుప్తా నీ మాత నిజము నేను గుర్తు తప్పి నేనే నీ వ్రతమును మరచినాను.  నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపినా నేనూ చిత్ర గుప్తుని నోమును నోచుకోని వచ్చెదనని బ్రతిమిలాడెను.  అందుకా చిత్రగుప్తుడు అంగీకరించినవాడై ఆమెను భూలోకమునకు  పంపించెను.  భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్దలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్ర గుప్తుని వద్దకు వచ్చెను.  అందుకా చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గ లోక ప్రాప్తి నిచ్చెను.   ఉద్యాపన:  ఏడాదిపాటు నిత్యం పై కథను చెప్పుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవలెను.  అనంతరం ఉద్యాపన చేసుకోవలెను.  ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచములు కట్లు లేని గంపలో పొయ్యవలెను.  ఆ వాడలలో గుమ్మడి పండును వుంచవలెను.  అడ్డెడు తవ్వాడు (2-1/2)  బియ్యము ఆకుకూరలు, పట్టు పంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు, బంగారు గంటము దక్షిణ తాబూలములతో అన్న గారికి ఇవ్వవలెను. 

గురువారం, డిసెంబర్ 27, 2012

కన్నె తులసి నోము

       పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది.  ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది.  అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది.  సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది.  అందకు అతడు అంగీకరించలేదు.  ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది.  అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు.  చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారించికి వెళ్ళింది.  పిల్లను పంపించమని అడిగింది.  వారు అంగీకరించలేదు.  వారితో జగదమాది ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది.  
              ఒక రోజున ఆ చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది.  తనకు కూడా ఆసక్తి కలిగి ఇంట గల అరిసెలు తెచ్చి నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది.  ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా!  గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల  నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది.  కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది.  ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది.  నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో చూసుకునేది.  
ఉద్యాపన:  తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి.  ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి. 

మంగళవారం, డిసెంబర్ 25, 2012

పసుపుగౌరి నోము కథ


            పూర్వము ఒక గ్రామములో ఒక పుణ్య స్త్రీ వుండేది.  పతి భక్తి కలిగిన ఇల్లాలు నిరంతరం పతిసేవాలు చేస్తూ అతనీ పాదాలను కళ్ళకు  అద్దుకుంటూ సంసారమును సాగిస్తుండేది.  ఆమె భర్తకు ఉబ్బస వ్యాధి, మాట్లాడడానికి కూడా ఎంతో కష్టంగా వుండేది.  ఆహార పానీయాలు కూడా సవ్యంగా జరిగేవి కావు.  తగ్గు ముఖం పట్టని వ్యాధితో నిరంతరం మంచాన పది మగ్గుతుండేవాడు.  తాను చనిపోతానని భయపడుతూ భార్యతో ఎంతో అధైర్యంగా అంటూ ఉండేవాడు.  ఆ మాటలకు ఆ ఇల్లాలు బాధ పడుతున్న భర్తకు ధైర్యవచానాలను చెప్పి ఒడార్చుతుండేది.  రాను రాను అతనికి మరణ భయం పెరిగింది.  యమభటులు తనను తీసుకుపోవడానికి వస్తున్నారని తాను చని పోతున్నానని పలవరించే వాడు ఎంతో ధైర్యంగా వున్న ఆమెలో భయాందోళనలు పెరుగుతూ ఉండేవి.  పార్వతీ దేవిని తలచుకుని తను సుమంగళిగా తనువూ చాలించాలని అనుగ్రహించమని వేడుకునేది.  
             ఒకనాడు భర్త భయాందోళనలతో  సొమ్మసిల్లి పడిపోయాడు.  కదలికలేని భర్తపై బడి తల్లీ!  మహేశ్వరీ నీకిది తగునా స్త్రీకి వైద్యమెంతో దుర్భరం ఈ వైద్యము నాకు కలుగజేయుట నీకు ధర్మమా అని పరిపరివిధాల రోదిన్చిండ్.  అందుకా పరమేశ్వరి బిడ్డా! లే ఎందుకలా  కుమిలి పోతావు నీ కొంచ్చిన బాధభయం ఏమీలేవు.  నీవు పసుపు గౌరీ నోము నోచుకో నీ అయిదవతనానికి కొరతరాదు  .  ఈ నోమును నోచిన కులకాంతకు నిత్యసోవ్భాగ్యం పసుపు కుంకుమ కొన్ని వేల జన్మలు సౌభాగ్యం కలుగుతుంది.  లేచి కృతనిశ్చయురాలివై గౌరీదేవిని ఆరాధించు ఇందుకు సమయం సందర్భం అక్కరలేదు.  తోచినదే తడవుగా ఇలా ఈ పసుపు గౌరినోమును ఏడాదిపాటు నోచుకోవాలి.  అట్టి వారు పుణ్య స్త్రీగా తనువూ చాలిస్తుంది  నీ భర్త ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్య వంతుడు అవుతాడు .   అని పలికి ఆశీర్వదించి అంతర్దానమైనది.  నిత్య సుమంగళిగా ఆమె నోము నోచుకున్నది.  ఆమె భర్త పూర్ణ ఆరోగ్య వంతునిగా చిరకాలం జీవించి తరించారు.  
ఉద్యాపన:  కథలో చెప్పబడిన మాటలు ప్రతి రోజు అనుకుంటూ అక్షింతలు నెత్తిన వేసుకుని సంవత్సరాంతమున సోలడు పసుపు వెదురు బుట్టలలో వుంచి అందులో నల్లపూసలు లక్క జోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు వుంచి ఒక పుణ్య స్త్రీ కి వాయనం ఇవ్వాలి.  ఒక ముదుసలి పెరంతాలికి భోజనం పెట్టాలి. 

సోమవారం, డిసెంబర్ 24, 2012

పదహారు ఫలాల నోము


         పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఆ రాజుగారి భార్య మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు.  రాజు భార్యకు గుణ హీనులు, గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు.  మంత్రి భార్యకు రత్నమానిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు.  ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది.  మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా!  నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము.  మరి నాకిట్టి బిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి అని అడిగింది.  
            అందుకా మంత్రి  భార్య బాగా ఆలోచించి రాని గారికి ఈ విధంగా చెప్పింది.  మహారాణి!  మీరు వ్రాతకాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నోలివచేసినారు.  వాటిలో వున్న వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడిన పళ్ళను గుర్తించక, వాటిని వేరుచేయక పేరంటాల్లకు పంచి పెట్టారు.  అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిని సంతానం కుంతీ, గుడ్డి, గునహీనులు అయ్యారు.  మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీలపాలిట పెన్నిది, కనుక మీరు మరలా  పదహారు ఫలాల నోమును నోయండి.  చక్కనైనవి శుబ్రమైనవిగా వున్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్వులు, దక్షిణ తామ్బూలాడులతో వాయనమివ్వండి అని చెప్పింది.
           రాని మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకుని, ఎంతో భక్తి శ్రద్దలతో పదహారు ఫలాల నోమును నోచుకున్నది.  అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం జరిగింది.  అందుకా రాని ఎతగానో ఆనందించింది.  
ఉద్యాపన:  పరిశుబ్రమైన పదహారు రకాల పళ్ళు ఎంచుకొని సమకూర్చుకోవాలి.  ఒక్కొక్క పండును, పువ్వులను దక్షిణ తామ్బూలాలను  ముత్తైదువునకు  ఇవ్వాలి.   తదుపరి సంతర్పణం చెయ్యాలి.

ఆదివారం, డిసెంబర్ 23, 2012

కైలాసగౌరి నోము


       పూర్వము ఒక రాజ్యములో మహారాజు తన కుమార్తెను అతి గారాబముగా పెంచి పెద్ద దానిని చేశాడు.  యుక్త వయస్సు రాగానే దేశ దేశాలు గాలించి అత్యంత సుందరాంగుడిని    వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు.  రాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళింది.  ఆమె భర్త వేశ్యాలోలుడు.  భార్యను సరిగా చూసేవాడు కాదు భర్త  అనురాగానికి దూరమై  ఆమె ఎంతగానో దు:ఖిస్తుండేది.  మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు.  తన బిడ్డ బ్రతుకుని సరిదిద్ద వలసినదిగా పరమేశ్వరరుడిని ప్రార్ధించేవాడు.  ఆ చిన్నది సైతం తన బ్రతుకు బాగుకై పార్వతి దేవిని నిరంతరం ప్రార్దిస్తుండేది.  


             ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి బిడ్డా! కైలాస గౌరినోము నోచుకో నీ బ్రతుకు సరియౌతుంది.  నీవు నీ భర్త అనురాగాన్ని పొందగాలుగుతావు అని చెప్పింది.  ఆ ప్రకారం రాకు కూతురు కైలాస గౌరీ నోము నోచింది.  అందుకు ఫలితంగా ఆమె భర్తకు, వెలయాలిపై మమతానురాగాలు తొలగిపోయాయి.  ఉంపుడు గత్తెల  కపట ప్రేమ పట్ల అసహ్యత కలిగింది.  భార్యపట్ల ప్రేమ సంతృప్తి కలిగింది.  ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్తే యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది.  వారిని చూచినా వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తుండేవారు.  
ఉద్యాపన:  పార్వతీ దేవి ఆలయంలో గాని నదీ తీరమునండుగాని అయిదు కుంచాల కుంకుమ అయిదు కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పములతో పంచిపెట్టి వారి ఆశీస్సులు  పొందాలి.

శనివారం, డిసెంబర్ 22, 2012

చిట్టిబొట్టు నోము


             పూర్వకాలములో ఒకానొక పదాతి ఇరుగుపొరుగు వారితో చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుండేది.    ఏ ఒక్కరితోను మంచిగా వుండేది కాదు అందరితోను విరోధంగా వుండేది.  ఆమెకు ఎవరు చెప్పారో  ఎలా ఉద్దేశం కలిగిందో చిట్టి బొట్టు నోము నోచింది నోము నియమానుసారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి.  అందుకుగాను పిలవబడే పెరంటాళ్ళతో    ఏ ఒక్కరితోను ఆమెకు పొట్టు కించిత్తు కూడా లేదు.  ఎలాగైతేనేం నలుగురికి బొట్టు పెట్టింది.  అయిదవ ఆమెకు బొట్టు పెట్టబోయే సమయంలో ఆమెలోని జగడపు బుద్ది ప్రజ్వరిల్లింది.  ఆమెకు బొట్టు పెట్టకుండా కసిరి కొట్టింది.  ఆవేశం ఆపుకోలేక తన బొట్టు తుదచేసుకుంది.  ఆ విధముగా చిట్టి బొట్టు నోముకు ఉల్లంఘన జరిగింది.  
             మరుజన్మలో ఒక బ్రాహ్మణుని ఇంట జన్మించింది.  ఆ దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.  కాని ఆ బిడ్డ ముఖాన బొట్టు నిలిచేది కాదు.  యెంత ప్రయత్నించిన ఎలా ప్రయత్నించినా ఎన్నిసార్లు  పెట్టినా ఆబిడ్డ నుదుట బొట్టు నిలిచేది కాదు.  ఈ వైపరీత్యానికి ఆ దంపతులు ఎంతగానో బాధపడుతున్దేవారు.  ఒకనాడు ఆ గ్రామానికి వచ్చిన త్రికాలజ్ఞానియైన ఒక యోగిని దర్శించి ఆ దంపతులు తమ బిడ్డలా విషయం చెప్పి వైధవ్య ప్రాప్తి ఉన్నదేమో అన్న భయాందోళనలను విన్న వించుకొని తరుణోపాయం చెప్పవలసినదని ప్రార్ధించారు.  అంతట ఆ యోగి తన మనోనేత్రంతో విషయాని గ్రహించి దంపతుల్లారా విచారించకండి.  గత జన్మలో మీ బిడ్డ పరమ గయ్యాళి ఎవరితోనూ సానిగా పొందక వుద్న్డేది కాదు.  అందరితోను గొడవలు పెట్టుకునేది.  ఈ గొడవలు మాని చిట్టి బొట్టు నోమును నోచి పేరంటాల్లకు బొట్టు పెట్టడంలో ఒక ముత్తిడువను వదిలివేయదమేగాక తన బొట్టును కూడా చేరుపుకుంది.  ఆ కారణంగా ఆమెకు నుదుట బొట్టు నిలవడంలేదు.  మీరామె చేత చిట్టి బొట్టు నోము నోయించండి పరిస్థితి చక్కబడుతుందని వైదవ్య ప్రమాదం తప్పుతుందని చెప్పారు.  
             ఆ ప్రకారం ఆ దంపతులు తమ బిడ్డ చేత చిట్టి బొట్టు నోమును నోయించారు.  బొట్టురాలిపదకుండా నుదుట యందు అమరుకున్నది.  గుణవంతుడు, రూపవంతుడైన యువకునితో ఆమెకు వివాహం జరిగింది.  ఈ నోము నోచుకున్న వారి బొట్టు చెదరక మంచి దాంపత్య సౌభాగ్యం కలుగుతుంది.  
ఉద్యాపన:  సంవత్సరకాలంపాటు వారం వారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి.  వారిచే అక్షింతలు శిరస్సున జల్లించుకుని వారికి పాదాబివందనం చేసి వారి ఆశీర్వచనాలు పొందాలి.

శుక్రవారం, డిసెంబర్ 21, 2012

సౌభాగ్య గౌరీ నోము


          పూర్వము ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాణి ఇద్దరు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిద్దలవలె పరిపాలిస్తున్దేవారు.  ఆ రాజుగారి భార్య గౌరీ పూజలతో నిరంతరం కాలం వెళ్ళబుచ్చుతూ వుండేది.  గుణవంతులైన పుత్రులు, మురిపములోలికించే మనుమాలతో ఆ రాజ దంపతులు హాయిగా బ్రతుకుతున్నారు.  పార్వతీ పరమేశ్వర్లు ఆమె భక్తికి మెచ్చి అతని సద్గుణాలను పరీక్షించాలన్న కోరిక కలిగింది. 
           ఆ రాజుకు విరోధి అల్ప బలవంతుడైన మరొక సామంతుదాయన మీదకు దండెత్తి వచ్చేలా చేసారు.  దైవబలం జతపదినందున సామంతరాజు ఈ రాజుతో హోరాహోరి యుద్దముచేసినాడు.  ఎందరో సైనికులు వీరస్వర్గం అలంకరించినారు.  బందు కోటి మరణించారు.  ఆఖరుకు ఆ రాజు కూడా యుద్దంలో మరనిన్హినాడు.  మహారాణి కిన్చితైనబెదరక యుద్ధభూమికి వచ్చింది.  యమదూతలు విగత జీవులైన వారి ప్రాణాలను తీసుక పోతున్నారు.  
           అంత మహారాణి వారిని నిలువరిచి యమదూతలారా మీకిదేటిసాహాసం.   నా పసుపు కుంకుమలు నిలిచి ఉండేటందుకు పసుపు వాయనమిచ్చిన దానను.  మా సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండగలందులకు బంగారం వాయనమిచ్చాను.  వసతి వాకిలి నిలిచేటందుకు తెల్ల చీరలు వాయనమిచ్చాను.  పొలం తోటలు వనాలు ఉండేటందుకు తోపు చీర వాయనమిచ్చినాను.  బిడ్డలా క్షేమం నిమిత్తం కుడుములు, అరిసెలు వాయనమిచ్చాను.  పొరుగువారి పచ్చదనాన్ని కోరి పొగడపూలిచ్చాను.  బంధువుల బాగుకై బంతిపూలిచ్చాను.  రాజ్యం సుభిక్షంగా ఉండుటకు రత్నాలు దేశాశాంతిని కోరి చల్ల పునుకులు పాడిపంటల పెంపునకు పాయసము పేరుప్రతిష్టలు అభివృద్దికి గారెలు, ప్రాణభయము లేకుండా పానకము, కోరికలు నేరవేరుతకు కొబ్బరిబొండాలు, స్వర్గలోక ప్రాప్తికై స్వర్ణ రాశి వాయనములిచ్చాను.  అకాల మరణం కలుగాకున్డుతకు అరటిపళ్ళు వాయనమిచ్చాను.  మీరు నా భర్త ప్రాణాలు గైకొనలేదు.  నా ప్రజలను యమపురికి తరలించలేరు.  పొందు పొందు తొలగిపొండు అని పలికింది.  ఆమె మాటలకు ఆమె చేసిన పుణ్య వాయనముల ప్రభావమునకు వెరచి యమభటులు ఉత్త చేతులతో మరలిపోయారు.  పార్వతి పరమేశ్వరులు ఆమె  ఔనత్యానికి సంతసించి సాక్షాత్కరించి ఆమె భర్తను పరనించిన తదితరులను బ్రతికించారు.  
ఉద్యాపన:  కథలో చెప్పిన వస్తువులను పుణ్య స్త్రీలకు వీలయినప్పుడల్లా వాయనమియ్యాలి.  అయిదుగురు ముత్తైదువులను పిలిచి గౌరీ దేవిని ఆరాధించి వారికి పసుపు, కుంకుమ రైకల గుడ్డ దక్షిణ తామ్బూలాడులతో ఒక్కొక్కరికి ఐదేసి వస్తువులు వాయనమివ్వాలి. 

గురువారం, డిసెంబర్ 20, 2012

నాగపంచమి నోము


               పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది.  ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు.  పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు  .   ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది.  చెవిలో చీము కారుతుండేది.  రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది.  ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.  ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.  
              ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది.  ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు.  ఆ సాదువు త్రికాలజ్ఞానుదని విని అతనివద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది.  అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమితని వినయపూర్వకముగా వేడుకున్నది.
             అందుకా సాదు పుంగవుడు  తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోశంవల్ల సంభవించినది.  ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తోలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.   నీవు గత జన్మలో నాగపూజా చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం.  నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి.  చెవి చక్కబడుతుందని చెప్పి  ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను.  ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.  
ఉద్యాపన:  శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది.  అభ్యంగన స్నానం చేసి మాదిగా శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని  ఆరాధించాలి.  నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి.  నాడు ఉపవాసం వుండాలి.  నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

బుధవారం, డిసెంబర్ 19, 2012

గణేశుని నోము


           పూర్వం ఒకానొక ఊరిలో ఒక పుణ్యవతి గత జన్మలో గణేశు నోము నోచి వ్రతమును నియమాను సారము సమాప్తి చేయక వుల్లంఘించింది.    అందుచేత ఆమెకు ఈ జన్మలో దు:ఖము సంభవించినది.  అనుదినం కడుపారా తిన్నా ఎంతటి వేడుకలో పాల్గొన్నా ఆమెకు ఏమి తోచేదికాడు.  స్థిమితం కలిగేది కాదు.  దు:ఖం మున్చుకొస్తుండేది.    ఒక్కత్తే కూర్చుని ఎడుస్తుండేది.  తోటి మగువలందరూ ఆమెను దూషిస్తూ వుండేవారు.  

           కారణం తెలియకుండా దు:ఖిస్తున్న ఆమెను చూసి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆమెతో నీవు ఒక పామును నీ కొడుకు పడుకున్న పక్కమీద ఉంచు, అది కరాచి నీ కొడుకు చనిపోయినచో నువ్వు ఎడువవలసినది.  నిన్నెవ్వరు నిందించారు అని చెప్పిరి.  వారి ఆదేశానుసారము ఆమె ఒక పామును కొడుకు పక్క వేయగా అది ఆ కొడుకునకు బంగారు మొలత్రాడు అయ్యింది.  
             నా ఏడుపు కారణం దొరకలేదని అడవికి పోయి ఏడవసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏమి జరిగినది అని ప్రశ్నించారు.  మీరు చెప్పిన ప్రకారము చేసినందున ఆ పాము నా బిడ్డ కి బంగారు మొలత్రాడై పోయినది.  అందువల్లనా ఏడుపుకు కారణం దొరకలేదని చెప్పింది.  పార్వతి పరమేశ్వరులు ఆమెకు ఒక తేలును ఇచ్చి దానిని నీ మనుమరాను బొట్టు పెట్టెలో పెట్టు, పెట్టె తెరవగానే  నీ మనుమరాలిని  తేలు  కుట్టి  ఏడ్చినప్పుడు  నువ్వు కూడా  ఆ కారణంగా  ఏడువ  వచ్చు  అన్నారు .  ఆ ప్రకారం  ఆమె ఆ తేలును బొట్టు పెట్టెలో పెట్టింది .  మనుమరాలు  ఆ పెట్టెని  తెరవగానే  ఆ తేలు  బంగారు బొట్టు చుక్కగా  మారిపోయింది .  ఈ పర్యాయం  కూడా  తన  ఏడుపుకు కారణం దొరకలేదని అడవికి వెళ్లి రోదించసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై సంగతి తెలుసుకున్నారు.  పిల్లిని ఇచ్చి దానిని ఇంటికి తీసుకువెళ్ళి చంపి దాని కారణంగా ఏడువ వచ్చు అని చెప్పినారు.  ఆ ప్రకారం ఆ పిల్లిని ఇంటికి తీసుకుని పోయి చంపి తాను ఎడువడానికి ఇరుగు పొరుగు వారిని పిలిచింది.  తీరా ఆ ఇరుగు పొరుగు వారు ఇంటికి రాగా ఆ పిల్లి కాస్తా బంగారు పిల్లిగా మారి పోయింది. 
              ఇరుగు పొరుగు వారంతా నవ్వుకుని పెల్లిపోగా ఏమి చెయ్యాలో తోచక వున్న ఆమె చెంతకు పార్వతీ పరమేశ్వరులు వచ్చి నువ్వు నీ గత జన్మలో గణేషుని నోమును ఉల్లంఘించి నందువల్లె నీకీ అకారణ దు:ఖం.  ఇది తోలగాలంటే నువ్వు గణేషుని నోమును నోచుకోవడమే నీకు మార్గం అని చెప్పారు.  ఆమాటలు మదికేక్కిన మగువ గణేషుని నోమును నోచుకున్నది.  దాని ప్రభావం వలన ఆమెకు దు:ఖం తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించింది.  
ఉద్యాపన:  కొత్త మూకుడులో అయిదు గిద్దేల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి.  స్వయం పాకంను దక్షిణ తామ్బూలాడులతో శివాలయంలో నంది దగ్గర పెట్టాలి. 

మంగళవారం, డిసెంబర్ 18, 2012

శివరాత్రి నోము


               పూర్వకాలములో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు.  అతడెంతటి విద్యాసంపంనుదో అంతటి దారిద్రము అతడిని వేదిస్తుండేది.  యెంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేదికాడు.  ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా వుండేది.  ఈ దుర్భర పరిస్తులతో మరొకర్ని యాతన పెట్టడం ఇష్టం లేక దేనికని వివాహం చేసుకోలేదు.  నా అన్నవారెవరూ లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు.  క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది.  ప్రాణాలు తీసుకోవడా శాస్త్రసమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పొయ్యక పోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు.  క్రమక్రమంగా ఓర్పు నశించింది.  ఇంకా ప్రాణ త్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు.  నీటిలో పడాలి, అగ్నికి ఆహుతికావాలి. కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు.  నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయీ! ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాదేడవు.  సదాశివుడు కన్నా దయామయుడు లేదు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది.  మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు.  విప్రోత్తమా పార్వతి పరమేశ్వరులు  జననీ జనకులు  కదా జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది.  ధన్యుడవు శివునకు ప్రీతియైన రోజు శివరాత్రి ప్రతిమాసంలో ఆఖరి మూడవరోజు శివరాత్రౌతుంది.  ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహా శివరాత్రి వరకు గడువు ఆనాడు కలిగిని మేరకు ఎవరికైన ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి.  దారిద్యము తొలగిపోతుంది .    ఆరోగ్య వంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్దలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖముగా వున్నాడు.  ఉద్యాపన:  ప్రతి మాసశివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి.  ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చెయ్యాలి.  మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్ధం చెయ్యక శివాక్షరిని జపించాలి.  శివునకు అర్చన చెయ్యాలి.  ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్ధిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి. 

సోమవారం, డిసెంబర్ 17, 2012

త్రినాధుని నోము


           పూరకాలములో ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు.  అతనికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు ఆబిడ్డడికి తల్లి వద్ద చాలినన్ని పాలు లేక ఆకలితో అలమటించు చుదేవాడు.  ఒక ఆవుని సంపాదిస్తే బిడ్డడికి పాల ఇబ్బంది ఉండదని నిర్ణయించుకున్నాడు.  అందుకుగాను ఇంటిలో గల కొద్దిపాటి మంచాలు కుంచాలు అమ్మి వచ్చిన సొమ్ముతో సంతకు బయలుదేరినాడు.  యెంత ధరకైన పాడి ఆవును కొనాలని ఆ బ్రాహ్మణుడు సంతలో తిరుగుతున్నాడు.  
         సంత జరిగే ప్రాంతానికి సమీపాన గల గ్రామంలో ఒక సంపన్నుని ఆవు ఇరుగు పొరుగు వారి పొలాలను పాడు చేస్తుండేది.  నిత్యం తగువులు తీర్మానాలతో విసిగిపోయిన అతడు దానిని ఎవరికైనా ఇచ్చి వేయాలని ఎంతో  ప్రయత్నిచినాడు  .    దానిని తీసుకోగాలన్డులకు ఎవ్వరూ ముందుకు రాలేదు.  సంతకు తోలుకు వెళ్తే దీని సంగతి తెలియని వారు ఖరీదు చేస్తారని నిర్ణయించుకొని ఆ సంపన్నుడు దానిని సంతకు తోలుకు వచాడు.  ఏ వెలకైనా అమాలని అతడు, ఏ వెలకైనా కొనాలని విప్రుడు సంతలో తారసపడ్డారు.  వదిలిపోతే చాలని అతడు దొరికితెచాలని యితడు ఉన్నందున ఆ ఆవు బార్హమ్నునకు అమ్మబడినది.  
          దానిని తోలుకుని స్వగ్రామానికి బయలుదేరిని విప్రుడు ఆనంద పారవశ్యంతో ఆదమరచి వుండగా ఆ ఆవు తప్పించుకుని పారి పోయింది.  అది దొరకక విప్రుడు ఒక చెట్టు నీడను కూర్చుని విచారిస్తున్నాడు.  విచారించి విచారించి తిరిగి సంతకు వెళ్లి వేదకాలని దాని యజమాని వైనం తెలుసుకుని అతని ఇంటికి గాని వేల్లిందేమో తీసితెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
            అలా వెళ్తున్న ఆ బ్రాహ్మణునకు త్రిమూర్తులు సాక్షాత్కరించి ఓయీ!నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని ప్రశ్నించారు.  ఆవును వెదుకుటకు వెళ్ళుచున్నాను అని విప్రుడు సమాధానం చెప్పాడు.  నువ్వు సంత దిక్కుగా గ్రామానికి వెళ్ళుతున్నావు గనుక నీవు తిరిగి వచ్చేటప్పుడు గంజాయి, ఆకు, వక్క, నూనె తెచ్చి పెట్టవలసినదిగా మూడు పైసలిచ్చారు.  అలాగేనని అంగీకరించి విప్రుడు సంతలో ఆవు అగుపించక తిరిగివస్తూ తెలేకలగానుగకు వెళ్లి ఒక పైసా నూనే ఇమ్మని చెంగుచాచాడు  ఇతడెవరో అమాయకుడని ఆలోచించి ఆగానుగా యజమాని సోలను తిరగేసి నూనెను అతని చెంగులోనికి కొలిచాడు.  ఆ విప్రుడు కొట్టుదిగేసరికి ఆ తెలికలవాని పాత్రల్లో నూనె అంటా మటుమాయమైయ్యింది.    అతడు లబూదిబూమని మొరపెట్టుకోగా చుట్టూ పక్కల వారంతా చేరి విషయాని తెలుసుకున్నారు.  విప్రుడిని మోసగించిన కారణం వల్ల అలా జరిగిందని గ్రహించారు.  అతడిని వెతుక్కుంటూ వెళ్ళి కిరాణా కొట్టు మీద ఆకు వక్కలు కొనుక్కుంటున్న ఆ విప్రుడిని చూసి అయ్యా! మీకు నూనె కొత్తాయన తక్కువ కొలిచాదట రండి సరిగా కొలిచిస్తాదట అని చెప్పి తీసుకెళ్ళి నూనె ఇప్పించారు.  అతడు తిరిగి వస్తుండగా త్రిమూర్తులు కనబడి అయ్యా నువ్వు మా కొరకై తెచ్చిన వస్తువులతో త్రినాధ పూజా చెయ్యి ణీ కష్టాలు తొలగుతాయి అని ఈ పూజలో నీకేమి ఖర్చు ఉండదని చెప్పి పంపించాడు.  అతడు ఇంటికి వెళ్ళి త్రినాధ పూజను గురించి భార్యకు చెప్పి దంపతులు ఇద్దరుకూడా భక్తి శ్రద్దలతో పూజా చేసారు.  త్రిమూర్తులు పూజా చేయడం వల్ల పోయిన ఆవు దొరికింది.  ఆ ఆవు అల్లరి చిల్లరిగా తిరగడం మాని చక్కగా పాలివ్వసాగింది.  బిడ్డది పాల బెడద తీరింది.  ఆయవారంవల్ల తిది వార నక్షత్రాలు చెప్పడం వల్ల కొద్దో, గొప్పో దానం ముట్టి వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగనారంభించాయి.  
             ఈ పూజా చేసిన వారికి సంసార సంభందమైన ఇబ్బందులు తొలగి జీవితం ప్రశాంతంగా సాగుతుంది.

ఆదివారం, డిసెంబర్ 16, 2012

కేదారేశ్వర (కార్తీక) నోము


               పూర్వకాలంలో  ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం వుండేది.  ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వున్నారు.  వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్ద వాళ్ళయిన కుమార్తేలిద్దరూ అడవికిపోయి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తున్దేవారు.  ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తుండగా పోలిమేరలోని ఒక నీటిలో ఏదో పూజ చేసుకుంటుండడము  చూసి ప్రసాదము తెచ్చుకోవాలని అక్కడకు వెళ్ళారు.  పూజా క్రమం చూసి ముచ్చట పది ఆ అమ్మాయిలూ ఈ పూజగురించి చేసే విదాన్నాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు.  ప్రసాదం తీసుకుని ఇంటికి వెడుతున్న వాళ్ళకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది.  ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుబ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఊడలు, పత్రీ ప్రోగుచేసుకుని వచ్చి నువ్వే మాదేవుదవని అక్కడగల ఒక రాతిని ఆ చెట్టు మొదలులో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమల పాకులు ఆకులు చేక్కలనుకో అని మర్రి ఆకులు, పళ్ళు పెట్టారు.  ఇవే బూరేలనుకో అని మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు.  ఇవే తోరాలనుకో అని మర్రి ఊడలు స్వామీ ముందు పెట్టి భక్తి టో పూజ పూర్తి చేసారు అక్కాచెల్లెళ్లు.  ఇంటికి బయలు దేరుతూ వాళ్ళు తమతమ గంపలను నెత్తిన ఎట్టుకోబోగా వాటిల్లోని పుడకలన్ని బంగారపు పుడకలుగా మారి వున్నాయి.  వారు ఆయనత ఆనందంతో ఇంటికి వెళ్లి తల్లి తండ్రులకు జరిగిన సంగతంతా చెప్పి ఆ పుడకలను అమ్ముకుని శ్రీమంతులైనారు.  
               సిరిసంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పునుండి ఒక మహారాజు వచ్చి పెద్దామేను, పడమరనుండి  ఒక మహారాజు వచ్చి చిన్నామేను పరిణయము చేసుకున్నారు.  వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్దా భక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకున్తున్దవలసిందని చెప్పారు.  ఆ ప్రకారముగా చేస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నారు.  కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పించుకున్నాది.  పాత తోరాలను తీసి పెరటిలో కాకరపాదు మీద వేశాడు.  బంగారపుతోరాలు చేయించాడు.  నవగాయ పిండివంటలతో గారెలు, బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు.  గ్రామస్తులంతా అతనిని ఎంతగానో ప్రశంసించారు.  కానీ కేదారేశ్వరిని కరుణ మందగించింది.  ఏడాదికేడాది వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపురించింది.  తినడానికి తిండిలేని దుస్తుతి కలిగింది.  ఏ పని చెయ్యాలన్న జరగక పోగా కష్టాలు కుగుతున్దేవి.  ఆ ఇల్లాలు తమ పెరటిలో విరగ కాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకిచ్చి అంగడికి వెళ్లి చారెడు నూకలు పప్పు ఉప్పు తీసుకురమ్మని పంపించింది.  ఆవి తీసుకు వెళ్లి అతడు షావుకారు అంగడి ముందు నిలుచున్నాడు.  యెంత సేపటికి ఆ షావుకారు చూడలేదు.  తరువాత చూసి ఏమిటి తీసుకోచావని ప్రశ్నించాడు.  అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు బియ్యం ఇప్పించండి మీ పేరు చెప్పుకుని ఈ పూట కింత గంజితాగుటాము అన్నాడు.  అలానా మీకు దారపోయడానికి మాకేం మధ్యన్తరపు సిరికలుగలేదు.  వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు.  కాళ్ళా వెళ్ళా పది బ్రతిమిలాడినా యితడు  వదిలేల లేడు అని దోసెడు బియ్యం పప్పు ఉప్పు ఇప్పించి పంపించాడు.  ఆ పూటకు వాళ్ళు ఆకలు తీర్చుకుని మరునాడు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్లి అమ్ముకుని రమ్మని పంపింది.  
             వాటిని పట్టుకుని అంగడి వీధికి వెడుతున్న బాలుడిని షావుకారు ఆపి ఏమి కావాలంటే అవి ఇస్తాను రోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసినదిగా చెప్పి భారీగా సెచ్చాలు బియ్యం ఇచ్చాడు.  ఆ షావుకారు ఎందువల్ల అతనికింత దయకలిగిందంటే ముందు రోజున తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తము కొస్తే వాటిల్లో నుండి బంగారం ముద్దలుగా రాలి పడ్డాయి.  ఇవి ఇంకెవరికి దక్కకూడదని ఆ షావుకారు యెంత ఇవ్వడానికైనా సిద్దపడ్డాడు.  రోజు కుర్రవాడు దగ్గర కాకరకాయలు కొంతుండేవాడు.  కాకరకాయలు అయిపోయాయి.  ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మాని వేశాడు.  
              ఇక గత్యంతరము లేక తల్లి తన కుమారుడిని ప్రయాణము చేసి తూర్పునగల పెద్ద అక్క దగ్గరకు పంపించింది.  కష్టసుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది.  అతడు అక్క గారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలకు పెల్లనివ్వకపోతే అక్కడే వుండగా తల ఆరబోసుకోవడానికి మెడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలకు తీసుకు వెళ్ళింది.  అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు.  ఒక గుమ్మడికాయను దోలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్లి దానిని అమ్మకు ఇవ్వవలసినదిగా చెప్పి పంపింది.  తిరిగి వస్తూ అక్కగారిచ్చిన చద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేలమీద పెట్టి చద్ది తింటున్నాడు.  అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దాని తన్నుకు పోయింది.  చేసేదేమిలేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమట వున్న చిన్న అక్కగారి వద్దకు వెళ్ళాడు. నౌకరు వల్ల  అతని రాకను విని ఆమె బయటకొచ్చి తముడిని లోపలకు తీసుకు వెళ్ళింది కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నది.  ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది.  ఆ అక్క ఏమి ఇవ్వలేదు.  ఈ అక్కా ఏమి ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలు దేరాడు.  ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కుని కాసిన్ని మంచి నీళ్ళు త్రాగాలని నిర్ణయించుకున్నాడు.  అక్క గారు ఆ జోళ్ళను ఎక్కడా విడవ వద్దు అని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోనికి దిగాడు కాని ఆ బురదలో కూరుకుపోయి యెంత వెదికినా జోళ్ళు  దొరకలేదు.  
          ఈ సంగతంతా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు.  అది కార్తీక మాసం ఆమె కార్తీక నోము నోచుకున్తున్నది.  ఆడంబరంగా నోము నోయడంవల్లనే తన పుట్టింటిన దారిద్రము తాన్దవిస్తుందని గ్రహించి తమ్ముడిచేత ఆ నోము నోయించి ఆడంబరము కాదు నాయనా ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్లి కేదారనోమును నోయండి అని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించింది.  అతడు ఇంటికి వస్తుండగా గుమ్మడికాయ పండు తను లోగడ విడిచిన చోట కనిపించింది.  చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి.  వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదార నోమును భక్తి ప్రపత్తులతో జరిపించాడు.  క్రమక్రమముగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభావముతో జీవించారు.  
ఉద్యాపన:  ఇది కార్తీక మాసములో సోమవారాల్లో ముఖ్యముగా మూడవ సోమవారము, కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సామ్ప్రదాయమైతే ఆ రోజున చేయాలి.  ఉదయం నుండి ఉపవాసము ఉంది సాయంత్రము పరమేశ్వరుణ్ణి ఫల, పుష్ప పత్రితో పూజించాలి.  పాత తోరాలను కొత్తవాతితోపాటు స్వామీ సన్నిదానాపెట్టాలి  .    స్వామికి బూరెలు నైవేద్యం పెట్టాలి.  ఈ బూరేలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమె తినాలి.  పున్నమి చంద్రుడిని చూచి ఆహారం తీసుకోవాలి.  తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరచాలి.  ఈ నోమును కోడళ్ళకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా చేసు కుండటం సాంప్రదాయం.

శుక్రవారం, డిసెంబర్ 14, 2012

దంపతుల తాంబూల నోము


            పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం వుండేది.  ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము పెద్ద కుటుంబము.  ఆయనకు ముగ్గురు కుమారులు పెద్ద వారిద్దరికీ వివాహాలు అయి చక్కగా జీవిస్తున్నారు.  మూడవవానికి కూడా వివాహం చేశాడు.  అదేమీ ప్రార్బ్ధమోగాని ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోను చీటికి మాటికి గొడవలు జరుగుతుండేవి.  అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భాశలాడుతుండేవారు.  వారందరితో ఎంతో మంచిగా మసలుకోవాలన్న ఆమెకు సాధ్యమయ్యేది  కాదు.  
           కాలం గడచి పోతున్నదేకాని పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు నిష్టూరాలు ఎక్కువై పోయాయి.  అందుకు తమవల్ల దోషమేమితో తెలియని ఆ చిన్న కోడలు వారందరి మధ్య మసలుకోలేక ఒకనాటి రాత్రి ఊరూ పోలిపెరలోని శివాలయానికి వెళ్లి గోడుగోడున విలపించాసాగింది.  తనతప్పేమిటి ఈ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి, చావే నాకు శరణ్యమా!  అని అమాయకంగా ప్రశ్నించింది.  ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి బిడ్డా నీ వలన దోషమేమిలేదు.  నేవెంత సౌమ్యంగా వినయవిధేయతలతో మసలుకున్నా చులకనగా హేళనగా నీ జీవితమూ సాగుతుంది.  ఇందుకు గల కారణము గత జన్మలో దంపతతాంబూలాల నోము నోచి మధ్యలో ఆపివేశావు.  ఆ కారణం చేత స్త్రీలకు పురుషులకు నీపట్ల ద్వేశాభావాలు కలుగుతున్నది.  ఇది తోలగాలంటే నీవు నీ ఇంటికి పోయి దంపతతాంబూలాల నోము నోచుకో ఈ నోముకారనముగా నీ చుట్తో గల ఇరుగు పొరుగు వారు నీ ఇంటివారు మేట్టినిన్తివారు నీమీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు.  అని ప్రభోదించాడు.  
              ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్లి దంపతతాంబూలాల నోము నోచుకోని అయినవారందరిలో గౌరవమర్యాదలు మన్ననలతో హాయిగా జీవిస్తారు. 
ఉద్యాపన:  పార్వతీ పరమేశ్వరులకు పీటం ఏర్పాటు చేసి శతనామావలితో ఆ ఆదిదంపతులను ఆరాధించాలి.  గుణవంతులైన దంపతులను ఆహ్వానించి వాళ్లకు తలంటి నీళ్ళు పోసి నూతన వస్త్రాలు కట్టబెట్టి పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు ఆరగిమ్పజేసి దక్షిణ తాంబూలాలతో గౌరవించి వారికి పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి.  ఇలా పదిహేను వారాలు చేసి ఆఖరున అన్న సంతర్పణ చేయాలి.  ఇలా చేయడము వలన సాతివారిలో తోటివారిలో మేటిగా గుర్తిమ్పబడి గౌరవ మర్యాదలు గల జీవితాన్ని గడపగలుగుతారు. 

బుధవారం, డిసెంబర్ 12, 2012

తులసినోము


           పూర్వకాలంలో
భారతదేశమున గల విన్ద్యపర్వతాలకు దిగువ కాన్చానపురం అనే దేశం వుండేది.  దానిని ధర్మ శీలుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.  ఆయనకు లేక లేక ఒక్కగానొక్క కూతురు. ఆమెకు వివాహము జరిగితే నెల తిరక్కునడగానే   వైధవ్యం కలుగుతుందని ఆమె జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞులు చెప్పారు.  అందువల్ల ధర్మశీలుడు తన కుమార్తెకు, వివాహం చేసే ప్రయత్నమూ విరమించుకున్నాడు.  ఇలా కొంతకాలం గడుస్తుండగా రాజుగారి ఆస్థాన విద్వాంసుడైన మహీశ్వర బట్టునకు తండ్రికి తగ్గ తనయుడు అనదగిన కుమారుడున్దేవాడు.  అతడు రాజకుమార్తె అందచందాలు గుణగణాలు విని ఆమెను వివాహం చేసుకోవలెనని నిర్ణయించుకున్నాడు .  
            ఒకానొక శుభ దినమునా బ్రాహ్మణ యువకుడు రాజు దర్శనం చేసుకున్నాడు.  మహారాజు ఆ యువకుడికి తగిన మర్యాదలు చేసి తన దర్శనానికి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించినాడు.  మహారాజా!  మీరు అనుగ్రహిస్తానంటే నాదొక కోరిక సమస్త శాస్త్రాలు చదువుకున్న వాణ్ని విద్యలన్నింటిని ఆరితెరిడిన వాడిని మీరు సరేనంటే మీ కుమార్తెను వివాహము చేసుకోవాలనుకుంటున్నాను.  మీ  అనుమతికై వచ్చాను అన్నాడు.  ఆ మాటలకు మహారాజు ముఖం వెలవెల బోయింది.  విప్రకుమారా!  ఆమెకు వైధవ్యం ఉన్నందువల్లనే తెలిసి తెలిసి ఒక యువకుడిని అర్దాయుష్కుడిని చేసే కన్యాదానానికి వెరచి ఊరుకున్నాను.  నీవు వివాహం చేసుకుంటా నన్నావు  .   నా కుమార్తెకు నీకనా రూప గుణ సంపన్నుడు దొరకడం దుర్లభం కాని నిన్ను అర్దాయుష్కుడిని చేసి బ్రాహ్మణ హత్యా దోషమును పొందలేను నన్ను మన్నించు అన్నాడు.  
          అందుకా బ్రాహ్మణ బాలుడు మహారాజ మీ కాభయం సందేహం అక్కరలేదు.  నేను పూర్నాయుష్కుడిని అని జ్యోతిష్కులు ఎంతోమంది చెప్పియున్నారు.  అయినా ఇందుకు నాకు తెలిసిన మేర ఒక ఉపాయము చెబుతాను.  ఒక నెలరోజులపాటు నన్ను అనుమతిన్తించండి. హిమాలయ పర్వతాలలో ఋషులను దర్శనము చేసుకొని వారి ఆశీర్వాదము పొంది వస్తాను.  ఈ లోగా మీ అమ్మాయి చేత తులసినోము నోచుకునేలా తగిన ఏర్పాట్లు చేయండి.  అక్షయ సౌభాగ్యాలను అనుగ్రహించే చల్లని తల్లి శ్రీ తులసి స్త్రీల పాలిత కల్పవల్లి అందువల్ల మీ అమ్మాయికి సుమంగళి జీవితమూ లభిస్తుంది.  పూర్వం దేవతలు తమకు కలుగుతున్న అపజయాన నివారణకు శ్రీ తులసిని ఆరాధించారు.  ఆ మాటలకు ఆ రాజు ముగ్ధుడై బ్రాహ్మణ కుమారా నీమాటలు న మదికేక్కాయి.  నా కుమార్తె చేత తులసి వ్రతం చేయిస్తాను నువ్వు ఋషిపుంగవుల  దీవెనలను పొంది సంవత్సరాన్తమునాటికి రావల్స్సిందని చెప్పాడు.  అంతట ఆ బ్రాహ్మణ యువకుడు తుఅలై వ్రత విధి విధానములను వ్రత నియమములను వివరించి వెళ్ళిపోయాడు.   రాకుమార్తె తులసి వ్రతం సమాప్తి కావడంతో బ్రాహ్మణ యువకుడు రాజ్యానికి వచ్చి ఆమెతో వివాహితుడై కాంచన పురాన్ని చిరకాలం పరిపాలించాడు.  
ఉద్యాపన:  కార్తీక మాసం ఈ వ్రతానికి తగిన కాలం.  శ్రీమన్నారాయణుని 
విగ్రహాన్ని తులసి మొక్క వద్ద వుంచి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పంచామృత స్నానం చేయించి ఆవాహనం చేయాలి.  ముత్తైదువులకు యధోచితంగా పసుపు కుంకుమ గాజులు దానమివ్వాలి.  పుష్ప ఫలాడులతో వారిని సత్కరించాలి.

మంగళవారం, డిసెంబర్ 11, 2012

రథసప్తమి నోము



         పూర్వకాలంలో ఒకానొక మహారాజుకు లేక లేక ఒక కూతురు జన్మించింది.  ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు.  కాని ఆమె పుట్టుక కారణంగా రాజ్యంలో కొన్ని కలతలు ఏర్పడుతున్దేవి.  మహారాజు ఏ పని తలపెట్టినా జరిగేదికాడు.  ఇందుకు విఙులను పిలిచి శాంతి చేయించాలని నిర్ణయించారు.  రాజ్యంలోగల ప్రజ్ఞావంతులు అయిన విప్రులను పిలిపించి అన్ని విషయాలను వివరించాడు.  ఈ దుస్థితి తొలగే మార్గం ఏదైనా చెప్పమని అడిగాడు.  ఆ విప్రోత్తములందరూ ఒకటై ఆలోచించారు.  
           రాజా ఈమె గత జన్మలో వితంతువు అంతకు ముందు జన్మలో రధకారుని భార్య రధకారుడు చేసే ప్రతి పనిని విమర్శించి అతని పనులకు అడ్డుతగులుతుండేది.  అందువల్ల పై జన్మలో విధవరాలైంది.  తన కుటుంబ పోషణ భారం ఆమెదేకావడం వల్ల తప్పనిసరై వ్యభిచారం చేసి సంసారం సాగించింది.  వ్యభిచారం కారణంగా అనేక దుష్కృత్యాల పాలైంది.  ఆమె రథసప్తమి నోమును నోస్తే తమకు ఈ గండాలుండవు.  ఆమెకు  గల గతజన్మ పాతకాన్ని రూపు మాసి పోతాయి అని చెప్పారు.  
         వేద జ్ఞానుల భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన వేత్తలు నాకు నారాజ్యానికి గల సిరిసంపదలు మీరే, కనుక నాయందు నా పుత్రిక యందు పరిపూర్ణ ప్రేమాభిమానాలు కలుగచేసి నన్ను నా రాజ్యాన్ని కాపాదేతందుకు మీరందరూ రథసప్తమి నోమును నాకుమార్తేచేతనో యుంచండి వ్యయభారాలకు వేరవకండి అన్నాడు రాజు.  అందుకు వారందరూ ప్రభువు ఆజ్ఞ ప్రకారము రాజకుమార్తె చేత రథసప్తమి నోమును నోయించారు.  అరిష్టాలను తొలగిపోయాయి.  సుఖ శాంతులతో జీవితాన్ని గడిపారు.   ఉద్యాపన:  సూర్యభగవానుడు మన కర్మలకు సాక్షి ప్రతి రోజు సూర్యోదయ  కాలములో ఆ మహానీయునకు నమస్కరించుకుని మనం మన నిత్య కార్య క్రమాలకు పూజుకోవారి. 

సోమవారం, డిసెంబర్ 10, 2012

ఏడురోజుల వ్రతాలు ఎన్నో శుభఫలాలు


వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం!

రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.

ఆదివారవ్రతం: చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.

వ్రతవిధానం: ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.

సోమవార వ్రతం: అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.

మంగళవారం: ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.

వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.

బుధవారవ్రతం: స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.

గురువారవ్రతం: మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.

వ్రతవిధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.

శుక్రవార వ్రతం: దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.

వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం
లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.

శనివారవ్రతం: వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.

వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.

ఏ పూజ, వ్రతం చేసేటప్పుడయినా ఫలితం కోసం గాక శ్రద్ధాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మ చర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా ఉండాలి.

గురువారం, డిసెంబర్ 06, 2012

బుధవారం, డిసెంబర్ 05, 2012

శనివారం, డిసెంబర్ 01, 2012

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...